CTR: తవణంపల్లె మండలంలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఈవో మునిశేఖర్, ఛైర్మన్ రఘుపతి తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసి, రాత్రి 8 గంటలకు తిరిగి తెరిచి, 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.