E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో సోమవారం రాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, గాంధీ పురం ప్రాంతాలకు చెందిన 20 మంది గత నెల 16 నుంచి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మరణించగా, తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.