AKP: కేజీబీవీలో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచినట్లు కోటవురట్ల కేజీబీవీ ప్రత్యేక అధికారి సరితాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. 6వతరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు, ఏడు నుంచి 12 తరగతిలో ఖాళీలకు ఆల్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.