అన్నమయ్య: రామాపురం మండలం నీలకంఠరావుపేట పంచాయతీ శ్రీసాయినగర్ మంగళవారం రాత్రి దర్గా ఉరుసులో ఎస్సై శివకుమార్ పలువురు వైసీపీ నేతలు గొడవపడ్డ విషయం తెలిసిందే. నల్లగుట్ట పల్లె సర్పంచి నాగభూషణ్ రెడ్డి కుమారుడు పవన్ ఎస్సై కాలర్ పట్టుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో గొడవకు కారణమైన 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్సై తెలిపారు.