విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కమిటీల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న వార్డుల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలని, సభ్యత్వ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసి ముద్రణకు పంపాలని నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు పేడాడ రమణికుమారి, నాయకులు పాల్గొన్నారు.