KDP: చెన్నూరు ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మైదుకూరుకు చెందిన దండు బాలనారాయణ, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు చెందిన 2 నెలల చిన్నారిని, ఆమె తండ్రి రూ.50 వేలకు విక్రయించినట్లు లక్ష్మి తెలిపింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న తను ఆసుపత్రిలో ఉండగా, భర్త, సిబ్బంది, మరో స్థానికురాలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.