UPలోని అమ్రోహాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రూహి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఆహారంలో మత్తుమందు ఇచ్చి, గొంతు కోసి హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీ అని నమ్మించేందుకు రాత్రంతా శవం పక్కనే పిల్లలతో కలిసి నిద్రపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.