TPT: మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతికి వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులోని ఓ మిల్క్ ట్యాంకర్ భోగి బోల్తా పడింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.