MDCL: కీసర పరిసర ప్రాంతాల్లో క్రషర్ గుంతలు తీవ్ర సమస్యగా మారాయి. అనేక ప్రాంతాల్లో గుంతలు నీటితో నిండి ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో స్థానికులకు ప్రమాదం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే స్పందించి, గుంతలను పూడ్చడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం అవసరమని, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.