ELR: చేబ్రోలులోని గీతాంజలి పాఠశాలలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు తెలిపారు. మొత్తం 13 కంపెనీలు ఇందులో పాల్గొని 1,070 పోస్టులను భర్తీ చేయనున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ చేసిన 18- 35 ఏళ్ల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:30 గంటలకు స్టడీ, ఇతర సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు.