చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పూణేపల్లిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. టిడ్కో గృహాల ద్వారా అర్హులైన కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడం జరుగుతోందన్నారు.