MNCL: అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం లక్షెట్టిపేటలోని సీడీపీవో కార్యాలయంలో స్థానిక సీడీపీవో రేష్మకు అంగన్వాడీ టీచర్లతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అంగన్వాడి టీచర్లకు మే నెలలో సెలవులు ఇవ్వాలన్నారు. వారి పెండింగ్ వేతనాలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.