గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆ జట్టు 156/2 పరుగులు చేసింది. స్టబ్స్ (32*), బవుమా (36*) క్రీజులో ఉన్నారు. వారిద్దరూ టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.