E.G: నిడదవోలు నియోజకవర్గం నడుపల్లి కోటలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు,పేదలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.