W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో అనుమతులు లేని పలు వాటర్ ప్లాంట్లపై అధికారులు సోమవారం ఉగ్రరూపం ప్రదర్శించారు. లైసెన్సులు లేని, కలుషిత నీరు సరఫరా చేస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏఈ విజయ్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ సాకేత్ బాబుల ఆధ్వర్యంలో ప్లాంట్లకు తాళాలు వేశారు.