WNP: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే అర్జీలను ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారాలను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని ఆదేశించారు.