VKB: పరిశ్రమల పేరుతో మా భూములను లాక్కొని మా జీవితాలను నాశనం చేయవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన రైతులు పరిశ్రమల పేరుతో భూములను లాక్కోవద్దని ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధి పేరుతో భూములను లాక్కొని పేదల రైతుల జీవితాలను నాశనం చేయవద్దన్నారు.