AP: విజయనగరం సబ్ జైలు, గ్రామీణ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైలులో వంటగదిని పరిశీలించారు. అనంతరం భోజనం ఎలా ఉందని ఖైదీలను హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విజయనగరం రూరల్ పీఎస్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం.