NZB: కమ్మర్ పల్లిలోని నాగపూర్ గ్రామంలోని పురాతన రామాలయం అభివృద్ధికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ఈ మేరకు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను కలిసి రామాలయం అభివృద్ధికి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.