JGL: జగిత్యాల జిల్లాలో ఉల్లాస్-నవభారత సాక్షరత కార్యక్రమం మూల్యాంకన పరీక్షలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.రఘువరణ్ పరిశీలించారు. జగిత్యాల రూరల్, అర్బన్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో సుమారు 22 వేల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సంఘాల సహకారంతో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి కొనసాగుతుందని తెలిపారు.