NLR: లింగసముద్రంలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పంటను రక్షించేందుకు రైతు పొలానికి అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటుతో, ఆ మార్గంలో వెళ్లిన గేదె విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కరెంట్ ఏర్పాటు చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.