VZM: వాహనదారులు నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారణకు సహకరించాలని బొబ్బిలి SI రమేశ్ సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక పాత డంపింగ్ యార్డు వద్ద వాహన తనిఖీ చేపట్టి పాత చలానాలను కట్టించారు. ఆయన మాట్లాడుతూ.. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.