E.G: మిల్లర్లు, దళారుల కుమ్మక్కుతో సన్న బియ్యం పండించిన రైతులు దివాళా తీస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు ప్రేక్షక పాత్ర పోషించడంతో మిల్లర్ల దోపిడీకి రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరించకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారన్నారు.