MNCL: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధం ఆపాలని సీఐటీయూ అనుబంధ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు డిమాండ్ చేశారు. ఆదివారం చెన్నూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంతో భారత దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్కు ఇబ్బంది పడుతున్న ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.