సత్యసాయి: సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఆదివారం ప్రారంభించారు. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సహకారంతో ఆరు వెంటిలేటర్లు, మూడు ఎలక్ట్రో సర్జికల్ యూనిట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్ అందుబాటులోకి తెచ్చారు.పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.