WGL: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మనకు, మన పిల్లలకు మంచిది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. అసెంబ్లీలో నేడు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సమాజం మారాల్సిన అవసరం ఉందని, విలువలు, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతలను పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.