AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. మూడేళ్ల కూతురు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తల్లి శంకరకుమారి, చిన్నారి మౌనిక మృతి చెందారు. తండ్రి గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.