VKB: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన తుప్పలి వెంకటమ్మకి సీఎం సహాయనిధి కింద రూ. 60,000 మంజూరైంది. ఈ చెక్కును గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప, ఉప సర్పంచ్ జె.దస్తయ్య అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని సర్పంచ్ తెలిపారు.