RR: మియాపూర్లోని చెరువులను సుందర వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి పెద్ద కుడి చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణం అందించడమే తమ బాధ్యతని, ఎమ్మెల్యే సహకారంతో ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.