MBNR: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా అధికారులతో నిర్వహించిన సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు.