VZM: మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో చిన్నారులు, యువత మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ఈత మట్టలు పట్టుకొని తిరుగుతూ కీర్తనలు పాడారు. మట్టల ఆదివారం ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు జీవిత చరిత్రను పాస్టర్ అబ్రహం వివరించారు. మానవాళికి శాంతిని, సన్మార్గాన్ని నడిపించడానికి భూలోకానికి వచ్చి మానవుల కోసం చనిపోయారని బైబిలు చెబుతోందన్నారు.