మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయవరం బస్సు ప్రమాద బాధితులను నూతన కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం రాత్రి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఆస్పత్రి నుంచి వెళ్లాలని వారికి భరోసా ఇచ్చారు.