GDWL: కేంద్రం నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం అయిజలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఉండాలని నినదించారు.