KNR: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 శిక్షణా తరగతులు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల కర్తవ్యాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో బొమ్మకల్ నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కార్పొరేటర్ మ్యకల వెంకటేష్, రైల్వే బోర్డు సభ్యులు పాశం తిరుపతి, అసిరి తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు శిక్షణలో పాల్గొన్నారు.