TG: ప్రజలకు నష్టం జరిగితే ఆరు నూరైనా అడ్డుకుంటామని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట 10 వేల ఇళ్లను కూల్చి, వేల ఎకరాల భూములను లాక్కోవడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అలాగే, ప్రభుత్వం దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సీఎం మాటలకు భయపడమని, రెండేళ్లలో ప్రజలే కాంగ్రెస్ను బహిష్కరిస్తారని విమర్శిస్తారు.