W.G: ఈస్టర్ పునస్కరించుకొని ఏప్రిల్ 4న నరసాపురంలో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 13 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పరుగుకు సంబంధించి శనివారం సాయంత్రం స్థానిక మిషన్ హైస్కూల్ గ్రౌండ్స్లో రన్ ఫర్ జీసస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమ పోస్టర్లు, కరపత్రాలు, టీషర్టులు ఆవిష్కరించారు.