TG: జైన మతంలోని శ్వేతాంబర, దిగంబరలకు అత్యంత ముఖ్యమైన మహావీర్ జయంతిని ఈనెల 31న జరగనుంది. భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణక్ మహోత్సవాన్ని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులతో కూడిన శోభాయాత్ర చేయనున్నారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.