BPT: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల పట్టణ సీఐ రాంబాబు సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరాలని తెలిపారు. పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో శనివారం చీల్ రోడ్ సెంటర్ వద్ద హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు.