NRML: పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్పై జరిగిన దాడిని ఐఎంఏ, స్థానిక వైద్యులు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 24 గంటలు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు అమానవీయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఓపీ సేవలను గంటపాటు నిలిపివేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శనివారం డిమాండ్ చేశారు.