GDWL: రాజోలి మండలంలో మహిళలను అక్షరాస్యులుగా మార్చే ‘ఉల్లాస్’ పథకం ముగింపు పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మొత్తం 1,598 మంది మహిళలు పరీక్ష రాయనుండగా, ఇందుకోసం 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో అబ్దుల్ సాయీద్ ఖాన్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు VOAల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని, అధికారులు కేంద్రాలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.