NLG: టెన్త్ పరీక్షల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో బిక్షపతి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 71 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, రెగ్యులర్ విభాగంలో 19,718 మందికి గాను 19,664 మంది (99.73%) హాజరయ్యారు. అయితే ప్రైవేట్ విభాగంలో మాత్రం 24 మందికి గాను కేవలం 7 మంది (29.17%) మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ఆయన వివరించారు.