బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ రిటైర్మెంట్ ప్రకటనపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భావోద్వేగ ట్వీట్ చేసింది. కొందరు ప్రత్యర్థులు మన ప్రయాణంలో భాగమవుతారని.. అలాంటి వారిలో కరోలినా ఒకరని తెలిపింది. కోర్టులో తన ప్రవర్తన, అరుపుల వల్ల తనకు చాలా కోపం వచ్చేదని.. కానీ తర్వాత పరస్పరం గౌరవించుకున్నామని చెప్పింది. బ్యాడ్మింటన్ ప్రపంచం మారిన్ ఆటను మరిచిపోదని సింధు చెప్పుకొచ్చింది.