KDP: మైదుకూరు కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా తిప్పన పట్టాభిరాముడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనివాసులు, జాయింట్ సెక్రెటరీగా యశ్వంత్ రాయలు, లేడీస్ సెక్రెటరీగా బీ. హేమావతి ఎన్నికైనట్లు అసోసియేషన్ కమిటీ వెల్లడించింది. ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంలో సహకరించిన న్యాయవాదులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.