KMM: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిషత్ అప్పర్ ప్రాథమిక పాఠశాలకు సర్పంచ్ కోర్సా రాజేష్, ఉపసర్పంచ్ నాగ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వాటర్ ప్యూరిఫైయర్ను అందజేశారు. సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.