ఐఫోన్ యూజర్లకు ఆ కంపెనీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇది వరకు శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై సెక్యూరిటీ అలర్ట్ జారీచేసింది. ఇదే తరహాలో యాపిల్ కంపెనీ కూడా అలర్ట్ జారీ చేసింది.
Iphone Users: ఇటీవల శామ్సంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. దీనివల్ల యూజర్లకు తెలియకుండానే వాళ్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని రెండు రోజుల కిందట తెలిపింది. ఇదిలా ఉండగా తాజాగా యూపిల్ కంపెనీ కూడా యూజర్లకు ఇలాంటి అలర్ట్ జారీ చేసింది.
యాపిల్ కంపెనీకి చెందిన చాలా ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ తాజాగా తెలిపింది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే ఐఫోన్ యూజర్లు వెంటనే లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించి.. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతోపాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు తెలిపింది. యాపిల్కి సంబంధించిన ప్రతిదానిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించింది.