NLR: నియోజవర్గంలోని కోవూరు బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. ఆయా మండలాల్లో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నియోజవర్గంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.