ASF: ఆసిఫాబాద్ మండలంలోని కాప్రి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని దుర్వ శైలజ (20) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె, మార్చి 27 తెల్లవారుజామున కనిపించకుండా పోయిందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, చామనచాయ వర్ణం కలిగిన ఆమె అదృశ్య సమయంలో తెలుపు టాప్, గోధుమ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI బాలాజీ పేర్కొన్నారు.