ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కౌశాంబిలో కంటైనర్ను పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.