పార్వతీపురం పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ రామాలయంలో స్థానిక ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాములవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.