PDPL: డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మంథని ఎక్సైజ్ ఎస్సై సాయికుమార్ సూచించారు. ముత్తారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, నిరంజన్ పాల్గొన్నారు.